కాలియాదేహ ప్యాలెస్, ఉజ్జయిని ఆలయ పట్టణం యొక్క అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. దీనిని 1458 A.D.లో చాలా కాలం క్రితం సుల్తాన్ ఆఫ్ మండు కట్టించాడు. శిప్రా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ రాజభవనం ఉన్నది. పిండారిస్ కాలంలో ఈ రాజభవనం పూర్తిగా కూల్చివేయబడింది మరియు తిరిగి 1920వ సంవత్సరంలో శ్రీ మాధవ్ రావు సింధియ కట్టించారు.
ఈ రాజభవనం ఒక గొప్ప నిర్మాణాత్మకత విలువను కలిగి ఉన్నది మరియు రాజభవనం కేంద్ర హాల్, పెర్షియన్ నిర్మాణానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ రాజభవనం అక్బర్ మరియు జహంగీర్ సందర్శన వల్ల, రెండు పెర్షియన్ శాసనాల వారసత్వం కలిగి ఉన్నది. ఈ రాజభవనం, మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖవారి ప్రకారం తప్పనిసరిగా సందర్శించాలిసిన ప్రదేశాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ రాజభవనానికి రెండు వైపులా శిప్రా నది ప్రవహించటం వలన, ఈ భావన అందం ద్విగుణీకృతమయింది.