దియున్సార్ మహాదేవ టెంపుల్ యూనా లోని బాహి గ్రామం లో ప్రసిద్ధ క్షేత్రం. పాండవుల కుటుంబ పురోహితుడు అయిన ధౌమ్య రుషి ఈ ప్రదేశానికి వచ్చి దాని అందాలకు ముగ్ధుడై ఇక్కడ కొంతకాలం నివసించాడని చెపుతారు. అక్కడ ఆయన చేసిన పూజలకు మెచ్చిన భగవాన్ శివుడు ఆ ప్రదేశం లో తనను కొలిచిన భక్తుల కోరికలు నెరవేరుతాయని వరం ఇస్తాడు. అప్పటి నుండి ఆ ప్రదేశాన్ని దిఉనేశ్వర్ సదాసివ తీర్థ అన్నారు. ఇపుడు అది ధ్యున్సార్ మహాదేవ టెంపుల్ గా మారింది. ఈ టెంపుల్ ను సుమారు 50 సంవత్సరాల కిందట, ఉత్తర కాశి నుండి వచ్చిన స్వామీ ఆనంద్ గిరి ఒకసారి పునరుద్ధించారు . శివరాత్రికి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి, శివ లింగాన్ని పాలతో అభిషేకిస్తారు.
ఇదే సమయంలో ఇక్కడ ఒక ఉత్సవం కూడా జరుగుతుంది. భక్తుల సౌకర్యం కొరకు ఇక్కడ విశ్రాంతికి నివాసాలు , తాగు నీటికి సౌకర్యాలు టెంపుల్ యాజమాన్యం కల్పించారు.



Click it and Unblock the Notifications