ఆకర్షించే కథ తో ముడిపడడం వల్ల వాయనాడ్ లో ఉన్న ఈ చైన్ ట్రీ పర్యాటకులని ఆకర్షించే ప్రధాన పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది పర్యాటకులని ఇక్కడున్న అతిపెద్ద మర్రి చెట్టు ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న ఈ చెట్టుకున్న నేపధ్యం తెలుసుకుందాం. ఒక బ్రిటిష్ ఇంజనీర్, స్థానిక గైడ్ కరిన్తండన్ సహాయంతో నిర్విరామంగా పర్వతాల నుండి ప్రయాణం చేసి వాయనాడు కి చేరాడు. ఈ ప్రాంతాన్ని చేరుకున్న తరువాత ఆ బ్రిటిష్ ఇంజనీర్ తనకి సహాయం చేసిన గైడ్ ని చంపివేశాడు. ఈ ప్రాంతాన్ని కనుగున ఘనతని పొందేందుకు బ్రిటిష్ ఇంజనీర్ ఆ గైడ్ ని చంపడానికి ప్రధాన కారణం. అప్పటి నుండి ఈ దారి నుండి ప్రయాణం చేసే ప్రయాణికులని ఆ గైడ్ ఆత్మా వెంటాడుతూ వేధిస్తూ ఉండేది. చివరికి, ఒక పూజారి తన శక్తినంతా ఉపయోగించి ఆ ఆత్మని ఒక గొలుసుతో బంధించి ఈ చెట్టుకి కట్టాడు. అలా ఈ చెట్టుకి 'చైన్ ట్రీ' అనే పేరు వచ్చింది. ఇప్పటికీ, వేలాడుతున్న ఒక చైన్ కనిపిస్తుంది. వేల మంది పర్యాటకులని ఆకర్షించే చైన్ ఇది. ఇక్కడున్న అందమైన ప్రకృతి సౌందర్యం వల్ల కూడా వేల మంది పర్యాటకులు ఆకర్షింపబడుతుంటారు.