కాబిని నది వద్ద ఏర్పడిన డెల్టా (నదీ ముఖ ద్వారము వద్ద ఏర్పడే రెండు నదీ పాయల మధ్య ప్రదేశము) ప్రాంతం ఈ కురువ ద్వీపం. వాయనాడు జిల్లాలో ఇది ముఖ్యమైన నది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లతో ఈ ద్వీపం కళకళలాడుతుంది. వివిధ రకాల వృక్ష జాతులనీ, జంతు జాతులనీ ఇక్కడ గమనించవచ్చు. అరుదైన కొన్ని పక్షులకి ఈ కురువా ద్వీపం నివాస స్థలం. అసాధారణ మూలికలు మరియు ఆర్కిడ్స్ పూలు ఈ ద్వీపంలో కనబడతాయి. ప్రకృతిలోని అందాలని తనివి తీరా చూడాలనుకునే పర్యాటకులతో ఈ ద్వీపం అమితంగా ప్రాచుర్యం పొందింది. కురువా ద్వీపంలో ఉన్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ముగ్దులవుతున్నారు. అందువల్ల అత్యధికమంది పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. అద్దెకి తీసుకున్న ఫైబర్ బోట్స్ మరియు తెప్పల ద్వారా ఈ ద్వీపాన్ని సందర్శించే అవకాశం కేరళ పర్యాటక శాఖ కల్పిస్తోంది. ఈ ద్వీపం లో నున్న సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేందుకు సంవత్సరంలో కొన్ని సమయాలలో మాత్రమే ఇక్కడికి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. అందుచేత, ఈ ద్వీపం లో కి ప్రవేశించడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.