వాయనాడు లో ఉన్న బ్రహ్మగిరి కొండపై ఈ తిరునెల్లి గుడి ఉంది. ఈ పురాతనమైన గుడిలో విష్ణు మూర్తిని పుజిస్తారు. ఈ అద్భుతమైన గుడి వాయనాడు నుండి 900 మీటర్ల దూరంలో ఉంది. ఈ తిరునెల్లి గుడి ఒకప్పుడు హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్య క్షేత్రమని నమ్మకం. నలు వైపులా పర్వతాలు ఉండే లోయలో ఈ టెంపుల్ ఉంది. ఈ గుడి చుట్టుపక్కల ఉండే అడవులు చాలా దట్టమైనవి కావడం వల్ల ఇక్కడికి చేరుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఇది ప్రాచీనమైన గుడి అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఇది ఎప్పుడు నిర్మితమైందో తెలియచేసే ఆధారాలు మాత్రం దొరకలేదు. 962 - 1019 C E ల మధ్య ఈ గుడి ఉనికిలో ఉన్నదని రికార్డులు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ గుడి , దక్షిణ భారతీయులకి పూజించేందుకు ముఖ్య మైన ప్రాంతం. ఈ గుడికి సమీపంలో ఉన్న రెండు గ్రామాల శిధిలాలను పురావస్తు శాఖాధికారులు గుర్తించారు. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా అద్భుతంగా ఉన్న ఈ గుడి నిర్మాణాన్ని గమనిస్తే ఆశ్చర్యపోక మానరు.