అగర్తలా నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన కృత్రిమ సరస్సు కమలా సాగర్. ఇది భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మీద వుంది. 15 వ శతాబ్దంలో త్రిపురను ఏలిన రాజా ధాన్య మాణిక్య ఈ చెరువును తవ్వించాడని చరిత్ర చెప్తుంది. కమలా సాగర్ అగర్తలా నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈఈ సరస్సు ఒడ్డున సుప్రసిద్ధ కాళీ మందిరం వుంది. ఈ చెరువు 16 వ శతాబ్దం నుంచి వుందని చెప్తారు. దాదాపు 12 వ శతాబ్దానికి చెందిన దుర్గా దేవి విగ్రహం ఇక్కడ వుంది. ఈ సరస్సు చుట్టూ వున్న మంత్రముగ్దం చేసే అందమైన దృశ్యాల వల్ల ఇది మంచి విహార కేంద్రం గా కూడా పని చేస్తోంది. ఏడాది పొడవునా స్థానికులు, పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తారు. ప్రతి అక్టోబర్ నెలలో కమలా సాగర్ ఒడ్డున నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.