ఆగ్రా కోటలో ఉన్న జహంగీర్ మహల్ 1570లో అక్బరు చక్రవర్తి చే నిర్మించబడింది. దీనిని జినానా ప్యాలస్ లేదా రాజ పుత్ర స్త్రీల నివాసం కోసం నిర్మించారు. తన రాజపుత్ర భార్యల కోసమే అక్బరు ఈ మహల్ ని నిర్మిచాడు. ఆగ్రా కోట లోని ప్రవేశించగానే ప్రవేశ ద్వారానికి కుడీ పక్కన జహంగీర్ మహల్ ఉంటుంది.
ఈ కోట ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడి హిందూ ముస్లిం మిళిత శిల్ప కళ తో అలరాలుతూ ఉంటుంది. కొంచం లోపలకి ప్రవేశించగానే పెద్ద పెద్ద గదులతో కూడిన ప్రాంగణం ఉంటుంది. ఈ గదులని పర్షియన్ శైలి కళాక్రుతులతో ఉంటాయి. ఈ కోట లో ఉన్న అధ్భుతం ప్యాలెస్ దూలాన్ని నిలిపి ఉంచే రాతి బ్రాకెట్ల మీద ఉన్న శిల్ప కళా నైపుణ్యమే.
ఈ కోట తరువాతి కాలం లో జహంగీరు ద్వారా పునరుద్ధరించబడినది. అందువల్ల వెలుపల, లోపల గల డిజన్ లలో తేడ సుస్పష్టంగా కనపడుతుంది. జహంగీరు వ్రుత్తాకారపు ట్యాంకుని నిర్మించాడు. దీనినే జహంగీర్ హౌజ్ అంటారు. ఆయన కాలంలో దీనిలో పరిమళపు నీరు నింపి ఉంచేవారు.



Click it and Unblock the Notifications