జహంగీరు చక్రవర్తి తన చరిత్ర లో ఫిరుజ్ ఝాన్ గురించి ప్రస్తావించినా కూడా, అసలు ఈ వ్యక్తి షాజహాన్ చక్రవర్తి దర్బారు కి చెందినవాడు.ఆయన కి ఉన్న ఖ్వాజా సరాయ్ అన్న బిరుదు ఆయన రాజ కుటుంబ స్త్రీల నివాస సముదాయమైన హరం లేదా సెరాయ్ కి ఇంచార్జ్ అని తెలుపుతుంది.
ఫిరోజ్ ఖాన్ అక్టొబరు 7 1647 లో మరణించాడు.ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఫిరోజ్ ఖాన్ తాను బతికి ఉండగానే ఈ సమాధిని నిర్మించి దీనికి తాళ్ ఫిరోజ్ ఖాన్ గా నామకరణం చేసాడు.ఆగ్రా కి కొద్ది దూరం లో గ్వాలియర్ రోడ్డులో గల ఈ సమాధి రెండంతస్తుల భవనం. దీనిని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఈ ప్రాంగణం లోనికి దక్షిణ దిక్కున గల కమాను ద్వారా ప్రవేశించవచ్చు.
ఫిరోజ్ ఖాన్ సమాధి మొదటి అంతస్తులో అర్ధ వ్రుత్తాకారపు డొం కింద 40 అడుగులలో అష్టభుజి ఆకారంలో ఉంటుంది. ఈ సమాధి పశ్చిమ దిక్కున చిన్న మశీదు కూడా ఉంది. సమాధి మీద ఉన్న అలంకరణలు అక్బరు ఇతిమాద్-ఉల్-దౌలా సమాధుల ని స్ఫురింపచేస్తాయి.