1917 లో గాంధీజీ చే నిర్మించబడిన ,సబర్మతి నది తీరాన ఉన్న, గాంధీ ఆశ్రమం సబర్మతి ఆశ్రమం గా కూడా పిలువబడుతుంది. గాంధీజీ స్వతంత్ర పోరాటం లో ముక్య ఘట్టం అయిన దండి మార్చి వల్ల ప్రసిద్ది చెందినది ఈ ఆశ్రమం.ఈ ఆశ్రమం గాంధీజీ ని మరియు ఆయన జీవిత విశేషాలను స్మృతికి తెస్తుంది. గాంధీ గారు ఈ ప్రదేశాన్ని ఆయన నిర్మాణాత్మక ప్రయోగాలను అభివృద్ధి పరచటానికి అనువైన ప్రదేశం గా భావించారు. రాట్నం వడకటం మరియు ఖాది నేత వంటి దేశ భక్త కార్యక్రమాలను ఈ ఆశ్రమం లో మొదలుపెట్టారు.
ఈ ఆశ్రమం లో గైడెడ్ టూర్ ను ముందరగా అప్పాయింట్మెంట్ తో పొందితే పర్యాటకులకు ఇక్కడి విశేషాలను చూడటానికి ఉపయుక్తంగా ఉంటుంది.మగన్ నివాస్ , ఉపాసన మందిర్, హ్రిదయ్ కుంజ్ ,వినోబా - మిరా కుటిర్ , నందిని, ఉద్యోగ మందిర్, సోమ్నాథ్ చత్రాలయ, టీచర్స్ నివాస్, ద గాంధీ స్మరాక్ సంగ్రహాలయ, పెయింటింగ్ గేలరీ,మై లైఫ్ ఇస్ మై మెసేజ్ , లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ ఈ ఆశ్రమ విశేషాలు.గాంధీ స్మరాక్ సంగ్రహాలయ్ అనేది ఒక చిన్న మ్యూజియం, ఇక్కడ ఆయన లెటర్స్ మరియు ఫొటోగ్రాఫ్ లను ప్రదర్శిస్తారు.
ఆర్కైవ్ లో మనుస్క్రిప్ట్స్ , ఫెలిసిటేటన్స్, ఫోటో నెగటివ్లు , గాంధీ గారి జీవిత సంభదిత ఫైల్స్ కలిగి ఉంటాయి.హ్రిదయ కుంజ్ అనేది మహాత్మా గాంధీ మరియు కస్తుర్బా గాంధీ యొక్క లివింగ్ క్వార్టర్స్. వినోబా -మిర కుటిర్ లో ఆచార్య వినోభా భావే మరియు మిరబెన్ వివిధ సందర్భాలలో నివసించారు.ఉపాసన మందిరం ఇక్కడి ఆశ్రమం ప్రజల ప్రార్ధనా స్థలం.ఇదే విధం గా ఈ ఆశ్రమం లోని ఇతర విశేషాలన్నీ గాంధీగారి జీవితం తో ముడిపడి ఉన్నవే.