స్వామి నారాయణ మతానికి చెందిన ఈ మందిరం సనాతన హిందుత్వానికి చెందినది. గులాబీ రంగు ఇసుక రాతితో నిర్మించబడిన ఈ మందిరం లో ఈ మత స్థాపకుడైన స్వామీ నారాయణ విగ్రహం ప్రతిష్టింపబడి ఉంది. ఈ మందిరం లో ఉన్నటువంటి బంగారు పూత తో స్వామి నారాయణ విగ్రహం చెరొక పక్క స్వామి గునాతితానంద్ మరియు స్వామి గోపాలానంద్ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అక్షర ధం టెంపుల్ ఆహ్మెదబద్ కు 30 కి. మీ. ల దూరంలో గాంధి నగర్ లో కలదు.
మూడంతస్తుల ఈ మందిరం లో ముఖ్య అంతస్తుని హరిమండపం గాను, పై అంతస్తును విభూతి మండపం గాను కింది అంతస్థుని ప్రసాది మండపం గాను పిలుస్తారు. ఈ మందిరం 7 స్థంబాలు, 210 ఏకశిలా దూలాలు, 25 డోములు మైర్యు 8 జారోఖాలు కలిగి ఉన్నాయి. ప్రతి స్థంభం అద్భుతమైన చెక్కడాలని కలిగి ఉంది. ఉక్కుని ఈ నిర్మాణం లో ఎక్కడా వాడలేదు. ఈ శిల్పాలపై అందమైనటువంటి నగిషీలు చెక్కబడి ఉంటాయి.
కాంతి మరియు ధ్వనుల తో సనాతన హిందుత్వానికి వివిధ విశేషాల ప్రదర్శనలు ఈ ఆలయ సముదాయం లో జరుగుతాయి. వేదాలు, పురాణాలు మరియు ప్రాచీన హిందువుల గ్రందాల విజ్ఞానాన్ని ఈ ప్రదర్శనలు తెలుపుతాయి. మందిరం చుట్టుతా ఉన్న దారి 356 శిలా స్థంభాలతో నిర్మితమైంది. అంతే కాక ఇక్కడ ఉన్న అప్లైడ్ రీసెర్చ్ ఇన్ సోషల్ రీసెర్చ్ ఇన్ సోషల్ హార్మొనీ సెంటర్ వివిధ రీసెర్చ్ స్కాలర్ లకి అవకాశాలను కలిగిస్తుంది.