కేరళ లో ఉన్న కాతోలిక్ సిరియన్ సంతతికి చెందిన చర్చ్లన్నింటికీ ఈ చంపాకులం చర్చ్ తల్లి వంటిది. క్రీ.శ. 427 లో ఈ చర్చ్ ని నిర్మించారు. అప్పటి నుండి ఎన్నో పునరుద్ధరణలకు ఈ చర్చ్ గురయింది. ఈ చర్చ్ లో కనిపించే ఎన్నో ప్రాచీన రాతి శాసనాల ద్వారా దీనికి సంబంధించిన సంపన్న చారిత్రక వైభవాన్ని మనం గమనించవచ్చు.
వివిధ శకాల్లో చర్చ్ కి సంబంధించిన పరిస్థితుల గురించి వాటి ద్వారా గమనించవచ్చు.అలాంటి పూర్వ విషయాలను తెలియచేసే రాయి, 'రాక్ క్రాస్'. ఇది క్రీ.శ 1151 కి సంబంధించిన ఒక రాయి. ప్రతి ఏడు ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ మార్చ్ 19 వ జరుపుకుంటారు. ఈ చర్చ్ ని నిర్మించిన సెయింట్ జోసెఫ్ పేరు మిద ఈ పండుగ జరుపుకుంటారు. మరొక ముఖ్యమైన పండుగని అక్టోబర్ మూడవ ఆదివారం జరుపుకుంటారు.
అలెప్పి ప్రధాన నగరం నుండి ఈ చర్చ్ 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. బ్యాక్ వాటర్స్ మీంచి ప్రయాణం చేస్తే కొన్ని గంటల సమయం లో చేరుకోవచ్చు.