ఢిల్లీ శిఖరం ఢిల్లీలో ఉన్న అత్యధిక ప్రదేశం పురాతన ఆరావళి-వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో ఉన్నందున స్వచ్ఛమైన గాలి మరియు రాజస్థాన్ లో ఉన్నఎడారుల నుండి వచ్చే వేడి గాలులు నుండి నగరంను రక్షిస్తుంది.ఢిల్లీ ని గ్రీన్ లంగ్స్ అని కూడా పిలుస్తారు.ప్రపంచంలోని రెండవ అత్యంత బర్డ్ రిచ్ రాజధాని గా ఢిల్లీ నగరం గౌరవప్రదమైన ట్యాగ్ ని పొందింది.మొదటి స్థానంలో కెన్యాలోని నైరోబి ఉంది.
శిఖరంలో ఖనిజ లోహము మరియు శిలలకు ప్రసిద్ధి చెందింది, మరియు పాలనా ప్రయోజనాల కోసం ఈ క్రింది నాలుగు మండలాలుగా విభజించారు. అవి పాత ఢిల్లీ లేదా ఉత్తర శిఖరం, న్యూ ఢిల్లీ లేదా సెంట్రల్ శిఖరం, మెహ్రులి లేదా దక్షిణ మధ్య శిఖరం మరియు తుఘ్లకాబాద్ లేదా దక్షిణ శిఖరం.
ప్రస్తుతం శిఖరం దక్షిణ మధ్య భాగంలో ఆరావళి జీవవైవిధ్యం పార్క్ ఉన్నది.శిఖరం యొక్క ఉత్తర భాగంలో అనేక ఆసక్తికరమైన స్మారక చిహ్నాలు ఉన్నాయి.వాటిని వివరంగా మీకు అందిస్తున్నాం.