ఫెజోజ్ షాహ్ కోట్ల 1360 లో డిల్లీ ఐదవ నగరమైన ఫెరోజాబాద్ కనుగొన్నపుడు ఫెరోజ్ షాహ్ తుగ్లక్ చే నిర్మించబడిన కోట. ఈ కోట జామా మసీదు, అశోకా స్థంభం తోపాటు ఫెరోజాబాద్ లో ఉంది.
ఫెరోజ్ షాహ్ కోట్ల యమునా నది ఒడ్డున ఉంది. ఈ స్థలం ఎక్కువగా రాళ్ళతో నిర్మించిన ఈ మూడు అంతస్తుల నిర్మాణం ప్రముఖ అశోక స్తంభంగా ప్రసిద్ది చెందింది. 13 మీటర్ల ఎత్తు ఉండి, అశోక చక్రవర్తిచే ఏర్పాటు చేయబడిన ఈ స్థూపాన్ని ఫిరోజ్ షా మీరట్ నుండి డిల్లీకి తీసుకువచ్చారని నమ్ముతారు. ఇతర అశోక స్థూపాల లాగా ప్రజలలో బౌద్ధ మతాన్ని వ్యాపింప చేయడమే ఈ స్థూపం ఏకైక ఉద్దేశ్యం.
ఇసుకరాయితో నిర్మించబడిన ఈ స్థూపం, మధ్యాహ్న సూర్య కిరణాల వెలుగుతో కొంత లోహంతో ప్రతిబింబిస్తుంది. ఈ సమయంలో ఫెరోజ్ షాహ్ కోట్ల ని సందర్శించడం ఉత్తమం. జామా మసీదు, రాజ్ ఘాట్ దీనికి సమీప ఆకర్షణలు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు, రాజధాని నగరంలో ఎన్నో ఆడిటోరియంలు లేవు. సంగీత ప్రదర్శనలు లేదా ఇతర కళా ప్రదర్శనలను ఎక్కువగా ఫెరోజ్ షాహ్ మైదానంలో కానీ లేదా కుతుబ్ కాంప్లెక్స్ లో కానీ నిర్వహించేవారు.
ప్రగతి మైదాన్, రాజఘాట్, చాందిని చౌక్ మిగిలినవి ఫెరోజ్ షాహ్ కోట్ల కు సమీపంలోని ఇతర ఆకర్షణలు.