800 సంవత్సరాల కిందటి గౌరీ శంకర్ ఆలయం డిల్లీ లోని చాందిని చౌక్ వద్ద దిగంబర్ జైన్ లాల్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రధాన శైవ ఆలయాలలో ఒకటి.
ఈ ఆలయంలోని లింగం వెండితో చేయబడిన పాముతో చుట్టబడి ఉంటుంది. ఇది ‘విశ్వ స్ధూపం’ లేదా విశ్వ కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని శివునికి గొప్ప భక్తుడైన మరాఠా సైనికుడు అపా గంగాధర్ నిర్మించాడు. ఆతను యుద్ధంలో బాగా గాయపడినపుడు శివుడిని ప్రార్ధించి, అతని తీవ్రమైన దెబ్బలు తగ్గి బ్రతికితే ఈ ఆలయాన్ని నిర్మిస్తానని వాగ్ధానం చేసినట్లు ఒక కధ చెప్తారు. అసాధారణంగా, ఆతను పరిస్థితులను అన్నిటినీ ఎదుర్కొని ఈ ఆలయాన్ని చాందిని చౌక్ లో నిర్మించాడు. ఈ ఆలయం 1761 లో నిర్మించబడింది.
అపా గంగా ధర్ పేరు ఆలయ పిరమిడ్ ఆకారపు పైకప్పు దిగువ భాగం పైన చెక్కబడింది. అయితే, 1959 లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన సేథ్ జైపురా పేరు కూడా ఈ ఆలయ కిటికీలపై చెక్కబడింది. ఈ ఆలయ లోపలి భాగంలో శివుడు, అతని భార్య పార్వతి, కుమారులు వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగం ముందు శివుడు, పార్వతుల జాతి రాళ్ళతో అలంకరించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగంపై నిరంతరం నీరు బైటికి పోవడానికి వీలుగా ఒక వెండి కుండ ఉంటుంది.
ఎర్ర కోట, జామా మసీదు, గౌరీ శంకర్ ఆలయానికి సమీపంలోని ఆకర్షణలు.