గురుద్వారా శీష్ గంజ్ డిల్లీ లోని తొమ్మిది చారిత్రిక గురుద్వార్ లలో ఒకటి. దీనికి ఒక ఆశక్తికర చరిత్ర ఉంది. ఈ గురుద్వార్ తొమ్మిదవ సిక్కు గురువైన తేజ్ బహాదూర్ గురు జ్ఞాపకార్ధం నిర్మించబడింది. ఆ గురువు ఇస్లాం మతాన్ని తిరస్కరించడం వల్ల ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల ప్రకార౦ శిరఛ్చేదం జరిగింది ఇక్కడే.
కొన్ని దశాబ్దాల తరువాత, గురువుగారి గొప్ప అనుచరుడైన బాబా బఘెల్ సింగ్ తన గురువు శిరఛ్చేదం జరిగిన ప్రదేశం కనుగొని అక్కడ ఆయన గౌరవార్ధం గురుద్వార్ ని నిర్మించాడు.
గురుద్వార్ డిల్లీ లోని చాందిని చౌక్ లో ఉంది. 1930 లో నిర్మించిన గురుద్వార్ లో ఇప్పటికీ గురు శిరఛ్చేదం జరిగిన చోట మొండెం ఉంది. గురుద్వార్ కి దగ్గరలోని ఎర్ర కోట, ఫెరోజ్ షాహ్ కోట్ల, జామా మసీదు ప్రధాన ఆకర్షణలు.