మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి న్యూ ఢిల్లీ లో ప్రసిద్ధ సైట్ ఓల్డ్ ఫోర్ట్ / పురాణం ఖ్వుయిలా దగ్గరలో ఉంది. ఈ నిర్మాణం మిరాక్ మీర్జా ఘియాత్ అనే పెర్షియన్ వాస్తుశిల్పి చే నిర్మించబడినది.క్రీస్తుశకం 1562 వ సంవత్సరం లో హుమాయున్ జ్ఞాపకార్థం అతని భార్య హమీదా బాను బేగం సమాధిని నిర్మించారు. ఈ సమాధిని హుమాయున్ మరణించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత నిర్మించారు.
ఢిల్లీ లో ఉన్న హుమాయున్ సమాధి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది, మరియు లోధీ రోడ్ మరియు మథుర రోడ్ మధ్య నిజాముద్దీన్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న దీనిని 1993 వ సంవత్సరం లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.భారతదేశం లో ఉన్న మొఘల్ నిర్మాణలలో దీనిని ఒక అద్భుతమైన కట్టడంగా చెప్పవచ్చు.
ఒక అందమైన తోట సమాధి,అందమైన తోటలు, నీటి కాలువలు మరియు ఫౌంటైన్లు, పాదచారుల మార్గాలు ప్రహరీ లోపల ఉన్నాయి.ఈ ప్రహరీ లోపల ప్రస్తుతం ఇతర మొఘల్ పాలకుల సమాధులు ఉన్నాయి. ఇక్కడ, మిగిలిన సమాధులు మరియు ఆ ప్రదేశంలో ఉన్న ప్రస్తుతం స్మారక పేర్లు:
చార్ బాగ్ గార్డెన్:ఇది ఒక పెర్షియన్ శైలి చతుర్భుజ ఉద్యానవనం మరియు మొత్తం దక్షిణ ఆసియాలోనే ఈవిదంగా రూపొందించిన మొట్టమొదటి గార్డెన్ ఇది .
బార్బర్ సమాధి:
ప్రహరీ లోపల రాయల్ బార్బర్ సమాధి ఉంది,మరియు నాయి కా గుంబద్ అనే సమాధి కూడా ఉంది. ఆ సమాధుల మీద పేర్లు రాసి లేకపోవుట వల్ల ఎ సమాది ఎవరదో తెలియదు.
హుమాయున్ సమాధి సముదాయం లోపల ఇతర స్మారకాలు ఉన్నాయి.అక్కడ బు హలీమ సమాధి మరియు ఇసా ఖాన్ సమాధి మరియు గార్డెన్, నిల గుంబద్ ,అఫ్సర్వాల సమాధి మరియు మసీదు, చిల్లహ్ నిజాముద్దీన్ ఆలియా మరియు అరబ్ సారాయ్ యొక్క మసీదు ఉన్నాయి.