జహాపనా, క్రీ.శ. 1326-27 లో మొహమ్మద్ బీన్ తుగ్లక్ నిర్మించిన ఒక నగరం. ఢిల్లీ నాల్గవ మధ్యయుగ నగరంగా మంగోలుల నుండి ఈ ప్రాంతానికి పొంచి ఉన్న నిరంతర దాడిని ఎదుర్కోవడానికి నిర్మించిన ఈ నగరం ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలో ఉంది. జహాపనా చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, కుతుబ్ ప్రాంగణం, మెహ్రౌలీ రోడ్డు, చిరాగ్ ఢిల్లీ రోడ్డు ఉన్నాయి.
ఈ రోజున, జహాపనా, అనేక కోటలు, దీనిలోని ఇతర కట్టడాలు కేవలం శిధిలాలలో కనబడతాయి; సౌజన్యం: ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు తన రాజధానిని తరలించి తిరిగి ఢిల్లీ కు వచ్చిన మహమ్మద్ బీన్ తుగ్లక్ మనసులోని చపలత్వం. అయినప్పటికీ, జహాపనా సందర్శించడానికి ఆసక్తిని కల్గించే ప్రదేశం.
ప్రస్తుతం జహాపనలో ప్రసిద్ధ బేగం పురి మసీదు, సాధన ఎంక్లావ్ సమాధి, లాల్ గుంబద్, సేరై షాజీ మహల్, బిజయ్ మండల్ ఉన్నాయి. అప్పట్లో బేగం పురి మసీదు చాల పెద్దది. కాని ప్రస్తుతం దాని గోపురాలు చాల వరకు కూలిపోవడమే కాక ఈ భవనం వాడుకలో లేదు.
బిజయ్ మండల్, 1,000 స్తంభాల మొహమ్మద్ బిన్ తుగ్లక్ భవనం. ఇది కూడా ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది.