లోడి గార్డెన్ న్యూ ఢిల్లీ లోని ఒక పార్క్. 90 ఎకరాలలో విస్తరించి, పురావస్తు శాఖ వారిచే పరిరక్షించబడుతున్న ఈ ప్రాంతం రెండు ముఖ్య సమాధులకు పుట్టిల్లు – లోడి సమాధి, మొహమ్మద్ షా సమాధి. ఈ సమాధులే కాక, ఈ గార్డెన్ లో బార గుంబద్, షీష్ గుంబద్ కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు అన్ని 15వ శతాబ్ద౦లొ ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని పాలించిన లోడి, సయ్యద్ వంశస్తుల కాలపు నిర్మాణ అద్భుతాలు.
లోడి గార్డెన్స్, సఫ్దర్ జంగ్ సమాధి, ఖాన్ మార్కెట్ మధ్యలో ఉదయపు, సాయంత్రపు నడకకు ఇది ఉత్తమ ప్రదేశం కావడం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి ఇష్టమైన ప్రదేశం.
లోపలి స్మారక వివరాలను ఒక సారి పరిశీలించండి:
సికందర్ లోడి సమాధి: ఈ సికందర్ లోడి సమాధిని అతని కుమారుడు ఇబ్రహీం లోడి 1517 వ సంవత్సరంలో నిర్మించాడు. ఒక వేదికపై ఒక సాధారణ దీర్ఘచతురస్రాకారపు నిర్మాణం, దీనిని 1866వ సంవత్సరంలో బ్రిటిష్ వారు పునరుద్ధరించారు, ఇబ్రహీం లోడి బాబర్ చేతిలో ఓడి పోయిన వివారాలను తెలిపే శాసనాన్ని జత చేసారు.
మొహమ్మద్ షా సమాధి : లోడి గార్డెన్స్ లో కట్టిన మొట్ట మొదటి సమాధి. సయ్యద్ వంశపు చివరి పాలకుడు మొహమ్మద్ షాకు నివాళిగా అల్-అ-ఉద్-దిన్ ఆలం షా 1444 వ సంవత్సరంలో నిర్మించాడు.
బార గుంబద్: ఈ కట్టడపు పేరుకు అర్ధం ఒక పెద్ద గుమ్మటం, దీనికి ప్రక్కనే ఉన్న మూడు గుమ్మటాల మసీదుకు ఇది ప్రవేశ ద్వారంగా పని చేస్తుంది. ఈ ప్రాంతం లో సికందర్ లోడి పాలనా కాలంలో 1494 వ సంవత్సరంలో గుంబద్, మసీదు రెండింటిని నిర్మించారు.
షీష్ గుంబద్: షీష్ గుంబద్ అంటే గాజు గుమ్మటం. దీని నిర్మాణంలో వాడిన మెరిసే పలకల వలన ఆ పేరు వచ్చింది. ఈ గుమ్మటంలో ఒక గుర్తు తెలియని కుటుంబ అవశేషాలు ఉన్నాయి. షీష్ గుంబద్ కూడా సికందర్ లోడి పాలనలోనే నిర్మించారు.