ఈరోడ్ నడిబొడ్డున పెరియమారియమ్మన్ ఆలయం ఉంది. మారియమ్మన్ దేవతలందరికీ రాణి. ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం కొంగు చోళులు నిర్మించారు. ఈ ఆలయం మూడువేల ఐదువందల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే పొంగల్ గొప్ప పండుగ. ఇది ఏప్రిల్ నెలలో జరుగుతుంది, ఇది దక్షిణ భారతదేశం లోని అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు ఉత్సవ సమయంలో సందర్శించడం పవిత్రంగా భావిస్తారు. “మా-విలకు” పండుగ సమయంలో భక్తులు ప్రత్యెక పూజలు చేస్తారు.
అన్నిరకాల వ్యాధులను నయంచేసే శక్తి మారియమ్మన్ కి ఉందని చెప్పబడుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలి, దానిపై ఉన్న అద్భుతమైన కళాఖండాలు చాలా పసిద్ది చెందినవి.