మొదట్లో ఇది ఒక చారిత్రాత్మక గ్రామం, ఘజియా బాద్ కు 23 కి.మీ.ల దూరంలో మీరట్ - హపూర్ - బులంద్శార్ రోడ్ పై కలదు. స్థానికుల మేరకు ఈ గ్రామాన్ని రాజపుత్ర నాయకుడు దొల్ సింగ్ శిసోడియా కనుగొన్నాడు. తర్వాత 1780 లో దీని పై సిక్కులు దాడి చేసి వశ పరచుకున్నారు.
1857 మొదటి స్వాతంత్ర యుద్ధం లో ఇక్కడి ధైర్యవంతులైన రాజ పుత్రులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం చేయగా బ్రిటిష్ ప్రభుత్వం సుమారు 14 మంది రాజపుత్రులను ఉరి తీసింది. వారి మరణానికి చిహ్నంగా ఒక శతాబ్దం గుర్తుగా 1957లో గ్రామస్తులు వారికి ఒక స్మారకం నిర్మించారు. ఈ విలేజ్ లో సతి మాలినది దేవి టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.