ఉజాన్ బజార్ లో ని జోర్ పుఖురి కి పస్చిమాన ఉన్న ఉగ్రతార టెంపుల్ కాళి మాత కి అంకితమివ్వబడినది. అస్సాం లో ని ప్రధానమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. గువహతి నుండి ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు.
పార్వతి దేవి మరో అవతారం అయిన ఉగ్రతార అమ్మవారు ఈ ఆలయం లో కొలువుంటారు. ఈ ఆలయం గర్భగుడి లో ని దేవతా విగ్రహం ఉండదు. నీళ్ళు కలిగిన చిన్న గుంటని దేవతగా పరిగణించి కొలుస్తారు. బౌద్దులకి సంబందించిన గాధలు కూడా ఉండటం చేత బౌద్ధులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు.
క్రీ.శ. 1725 లో అహోం రాజు శివ సింగ్ చేత నిర్మించబడిన ఈ శక్తి మందిరం ఎంతో ప్రముఖమైనది. గువహతి లో ని ఇతర స్మారక చిహ్నాల లాగానే ఈ ఆలయం కూడా 1897 లో సంభవించిన భారీ భూకంపం వల్ల నాశనం అయింది. అందువల్ల ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం ఎన్నో సవరణల ఫలితం.



Click it and Unblock the Notifications