ప్రసిద్దమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించకపొతే గువహతి పర్యాటకం అసంపూర్ణం గా మిగులుతుంది. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఇది. అందుకే ఇది హిందువుల పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది. నగరం నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయం నీలచల్ కొండలపై ఉంది. పది మహావిద్యా ల కోసం అంకితమివ్వబడిన ఆలయాలను ఇక్కడ గమనించవచ్చు.
త్రిపురాసుందరి, మాతంగి మరియు కమలా లు ఈ ప్రధాన ఆలయం లోపల ఆకనిపించినా మిగతా ఏడూ అవతారాల కు ఈ ప్రధాన ఆలయం చుట్టు పక్కలే వేరు వేరు ఆలయాలు కలవు.
కామాఖ్య ఆలయం లో అమ్బుబచి మేలా ని జూన్ నెల మధ్యలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కాళీ మాత మరో రూపం అయిన కామాఖ్య అమ్మవారి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. తాంత్రిక మహర్షులు ఈ సమయం లో ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. దుర్గా పూజ ఇంకా మానస పూజలు కూడా ఇక్కడ జరుపుతారు.
కామాఖ్య ఆలయం లో ని కేవలం హిందువులకే ప్రవేశం అన్న విషయాన్నీ పర్యాటకులు ముందుగా తెలుసుకోవాలి.