గణేష్ గల్లీ అనేది ఒక చిన్న కాలువ. రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. హరిహరేశ్వర్ పట్టణంలో ఇది సుమారు మూడు అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంది. చివరి భాగంలో చూసే వారికి గణపతి విగ్రహం కనపడుతుంది. విగ్రహం కనుగొనిన చోటు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సుమారుగా ఇది నీటిలో 30 అడుగుల లోతులో ఉంటుంది. అలలు వచ్చే సమయంలో ఈ విగ్రహం స్పష్టంగా కనపడుతుందని భావిస్తారు. చల్లని గాలులు వీచే అందమైన ఈ ప్రదేశం హాయిగా విశ్రాంతి పొందాలనుకునేవారికి ఎంతో బాగుంటుంది.