హరిహరేశ్వర్ నుండి కొద్ది దూరంలో భాగమండల అనే చిన్న గ్రామం కనపడుతుంది. ఈ గ్రామం అందంగా ఉండి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన పేష్వా ఈ గ్రామాన్ని అనేక సంవత్సరాలపాటు తన వసతిగా చేసుకున్నాడని చెపుతారు. పేష్వాల వారసత్వం కల ఈ ప్రదేశం పేష్వా స్మారక్ లేదా పేష్వా మెమోరియల్ గా కూడా పేర్కొనబడుతుంది. బాన్ కోట్ కోట ఈ ప్రదేశంలో మరోక ఆకర్షణగా ఉంటుంది. దట్టమైన పచ్చదనంలోని సముద్రపు ఓడరేవు లోని జంగిల్ జెట్టీ తప్పక ప్రయత్నించాలి. ఇది స్ధానికులను, పర్యాటకులను భాగమండలం నుండి రత్నగిరి కోటకు చేరవేస్తూంటుంది.