ఇస్లాంనగర్ పర్యాటకం లో ప్రధాన ఆకర్షణ ఇస్లా౦ నగర్ కోట. ఈ బ్రహ్మాండమైన కోట చరిత్ర కు ఇస్లాం నగర్ తో అవినాభావ సంబంధం వుంది. దీన్ని 1715 లో ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ స్థాపించాడు. అయితే 1723 లో నిజాముల్ ముల్క్ దీని మీద దాడి చేసినప్పుడు దోస్త్ మొహమ్మద్ ఖాన్ కొద్ది కాలం ప్రతిఘటించిన తరువాత కోటను వదులుకున్నాడు. నిజాం బలవంతంగా చేసిన ఒప్పందం మేరకు అతడు తన కోటలోనే సేనానిగా వుండిపోయాడు. తరువాత 1806 నుంచినుంచి 1817 వరకు ఇది సిందియాల అధీనం లో వుంది. చివరికి ఈ కోటను భోపాల్ కు వప్పగించారు. ఈ కోటను అద్భుతమైన నిరమాన వైభవం తోనూ, కౌశలం తోనూ నిర్మించారు. ఈనాడు ఈ గ్రామంలోని పచ్చని పొలాల వెంట ఇస్లాం నగర్ గత వైభవ ఛాయలు చూడవచ్చు.



Click it and Unblock the Notifications