నగర రాజభవనం లో ఉన్న చంద్ర మహల్ జైపూర్ రాజు రెండవ జయ్ సింగ్ నిర్మించారు. రాజభవన ప్రాంగణంలో ఏడవ వంతు ఆక్రమించిన ఈ మహల్ ప్రస్తుతం జైపూర్ మహారాజుల నివాసంగా ఉంది. ఈ స్థలం అందమైన పుష్పాలంకరణలతో, అద్దాల గోడలతో, కుడ్య చిత్రాలతో ప్రసిద్ది చెందింది. ఏడు అంతస్థుల ఈ కోటలో, మొదటి రెండు అంతస్థులు సుఖ్ నివాస్ హాల్ భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, ర౦గ్ మందిర్, శోభా నివాస్ లేదా అందమైన సభ, చావీ నివాస్ లేదా అద్దాల గది ఉన్నాయి.