హవా మహల్ 1799 లో కవి రాజైన సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన ప్రసిద్ధ కట్టడం. ఇది జోహారి బజార్ సమీపంలోని ఐదు అంతస్తుల ఎరుపు, గులాబి రంగు ఇసుక రాయి భవనం. లాల్ చాంద్ ఉస్తా రూపొందించిన దీనిలో 950 కంటే ఎక్కువ కిటికీలు ఉన్నాయి. ఈ భవనాన్ని పల్చటి తెరల గుండా రాచకార్యాలు చూడటానికి స్త్రీల కోసం నిర్మించారు. ఈ భవనంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది.