జైపూర్ లో రెండో సవాయి జై సింగ్ మహారాజు స్థాపించిన జంతర్ మంతర్ భారతదేశంలోని ఐదు అంతరిక్ష పరిశోధనా సంస్థలలో పెద్దది. ఈ పరిశోధన సంస్థను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చి “మొఘల్ కాలపు చివరలో వున్న రాజుగారి దర్బారు యొక్క ఖగోళ నైపుణ్యం, విశ్వోద్భవ శాస్త్రీయ భావనల అద్భుత ప్రదర్శన” అని పేర్కొన్నారు.ఈ పరిశోధనా సంస్థ నిర్మాణంలో నాణ్యమైన పాలరాయిని వాడారు. దానికదే సాటి అయిన రాం యంత్ర (ఎత్తులను కొలించేందుకు వాడే పరికరం) మహారాజు గారి ఖగోళ నైపుణ్యాలను సూచిస్తుంది. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ’, ‘దక్షిణ’, ‘నారివల్య’, ‘రాశివలయాస్’, ‘చిన్న సామ్రాట్’, ‘పెద్ద సామ్రాట్’, ‘పరిశోధక స్థానం’, ‘దిశా’, ‘చిన్న రాం’, ‘పెద్ద రాం’ యంత్రం, చిన్న ‘క్రాంతి’, పెద్ద ‘క్రాంతి’, ‘రాజ్ ఉన్నతాంశ’, ‘జై ప్రకాష్’, ‘దిగంత’ వంటి వాటిని చూడవచ్చు.