అంబర్ కోట లోని ప్రధాన భవనంలో ఉన్న గణేష్ పోల్ ను, రెండవ జై సింగ్ మహారాజు 1611- 1667 ల మధ్య నిర్మించాడు. అంబర్ కోట లో ఉన్న ఏడు ప్రధాన ప్రవేశ ద్వారాలలో గణేష్ పోల్ ఒకటి. రాజులు, వారి కుటుంబాలవారు కోటలోనికి, తమ వ్యక్తిగత గదులకు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు ప్రత్యేకంగా ఈ ద్వారాన్ని నిర్మించారు. అందమైన రంగులతో తయారైన ఒక గొప్ప గణేశుని విగ్రహం ఇక్కడ ఉంది. ఈ ప్రవేశ ద్వారం మొఘల్, రాజపుత్రుల నిర్మాణ శైలుల సమ్మేళనానికి ప్రతీక.