జామ్వా రాంగర్, జైపూర్ ప్రధాన నగరం నుండి చాలా కొద్ది దూరంలోని ప్రసిద్ధ గ్రామం. ఈ ప్రాంతం కృత్రిమ సరస్సుకి, వన్యప్రాణుల సంరక్షణకి పేరుగాంచింది. ప్రతి రోజూ ఇక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చే వివిధ జాతుల వలస పక్షులు, స్థానిక పక్షి జాతులతో ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా మారింది. ఇక్కడి అభయారణ్యం లో చాలా పశు, వృక్ష జాతులున్నాయి. ఈ అభయారణ్యంలో పర్యాటకులు అటవీ విహారాన్ని ఆస్వాదించ వచ్చు.ఇక్కడి సరస్సు, వన్యప్రాణుల అభయారణ్యమే కాకుండా, మందిరాలు, భవనాలు, పురాతన కోటలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశంలో జైపూర్ పూర్వపు రాజుల సమాధులు కూడా ఉన్నాయి.