అంబర్ కోట లోపల ఉన్న శీలా దేవి ఆలయంలో కాళీ మాత విగ్రహం ఉంది. 16 వ శతాబ్దంలో, ఆమెకు గొప్ప భక్తుడైన మాన్ సింగ్ మహారాజు బెంగాల్ నుండి ఈ విగ్రహాన్ని తెచ్చాడు. ఈ ఆలయాన్ని అందమైన పాలరాయితో నిర్మించారు. ఇక్కడి కాళీ మాత అంబర్ కోటను రక్షిస్తుందని నమ్మకం. హిందువుల పండగైన నవరాత్రిని ఇక్కడ ఏంతో ఆసక్తిగా, ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.