పొంకర్ ఖేరి గ్రామం లో ఉన్న పుష్కర జింద్ నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది. జమదగ్ని మరియు రేణుకల కుమారుడైన పరశురాముడి చేత ఇది స్థాపించబడింది. బ్రహ్మ సంతతికి చెందిన వంశం వీళ్ళది.
మహా విష్ణువు యొక్క ఆరవ అవతారం గా అమరత్వాన్ని పొందిన పరశురాముడిని భావిస్తారు. శివుడి కృపని పొందడానికి పరశురాముడు ఘోర తపస్సు చేసాడు. శివుడే స్వయంగా పరశురాముడికి యుద్ద కళలను నేర్పించాడని అంటారు. ఒక గొడ్డలిని పరశురాముడికి కానుకగా అందించాడని పురాణ గాధ. పరశురాముడి తండ్రి క్షత్రియ రాజు అయిన కార్తవిర్య చేత చంపబడ్డాడని అంటారు.
తన తండ్రి మరణం తో కోపోగ్రస్తుడైన పరశురాముడు క్షత్రియులని వధించడం ద్వారా పగ తీర్చుకున్నాడని అంటారు. మహాభారతం లో ని కర్ణుడు మరియు ద్రోణాచార్యుల కి యుద్ద కళలను నేర్పించాడు. వివిధ బ్రాహ్మణ వంశాలకు ఆద్యుడు పరశురాముడు. సంప్రదాయం ప్రకారం, ఈ ఆలయం లో ని ప్రార్ధనలో భాగం గా అశ్వమేదాన్ని(గుర్రాన్ని) దానం ఇస్తారు. పితృదేవతలకు చేసే ప్రార్ధనలు పవిత్రమైనవిగా భావిస్తారు.