దెయ్యాలు, ప్రేతాలు అలాగే ఆత్మలకు దైవంగా భూతనాథ్ గా పిలువబడే మహా శివుడికి అంకితమివ్వడం వలన ఈ ఆలయానికి భూతేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. అందువల్లే, ఉత్తర భారత దేశం లో ఎక్కువగా శివుడి విగ్రహాలు కల్గిన ఆలయాలు కనబడతాయి. మనిషి చనిపోయిన తరువాత మిగిలినది వారి అత్మేనన్నది వారి ఉద్దేశ్యం.
ఈ ఆలయం గోహనా రోడ్ లోఉన్నది. జింద్ రాజ్య పాలకుడైన రాజ రగ్భిర్ సింగ్ చేత ఈ ఆలయం నిర్మించబడింది. చుట్టూ తలాబ్ లేదా నీళ్ళ ట్యాంక్ వల్ల అమ్రిత్సర్ లో ని గోల్డెన్ టెంపుల్ ఆకృతి లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని రాణి తలాబ్ అని కూడా పిలుస్తారు.
ఈ ట్యాంక్ ని నిర్మించడానికి ప్రధాన కారణం ఇక్కడే రాణి గారు స్నానాన్ని ఆచరించడం. అందువల్ల, రాజు ఒక ట్యాంక్ కలిగిన సొరంగాన్ని పాలసు తో పాటు నిర్మించారు. అందువల్ల, బహిరంగంగా కాకుండా రాణి గారు స్నానాన్ని ఆచరించవచ్చు. ఈ సొరంగం యొక్క శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఆలయం లో ని వివిధ దేవుళ్ళు మరియు దేవతలా విగ్రహాలు కనిపిస్తాయి. ఇది రాజ వంశం యొక్క కొలను గా ప్రసిద్ది.