రాంరై లేదా రామ్రే అనేది జాట్స్ చేత ఆధిపత్యం చేయబడిన గ్రామం. జింద్ కి దక్షిణాన 8 కిలో మీటర్ల దూరం లో జింద్-హన్సి లో ఈ ప్రాంతం లో ఉంది. యోధుడు, శూరుడు అయిన పరశురాముడి చేత నిర్మించబడిన రామహ్రద అనే కొలను పేరుతో ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది.
వామన పురాణం ప్రకారం, జింద్ వద్ద రాంరై గ్రామం లో ఉన్న రామహ్రద లో నే తన పూర్వికుల ఆత్మ శాంతి కొరకై క్షత్రియులను పరశురాముడు వధించి వారి రక్తం తో అయిదు కొలనులను నింపాడని అంటారు. ఆ రక్తం కొలనుల లో నీళ్ళ లా పారింది. అందువల్ల, ఈ కొలనులోని స్నానం పవిత్రమైనదిగా భావిస్తారు.
పరశురాముడికి అంకితమివ్వబడిన పురాతన ఆలయం ఇక్కడికి సమీపం లో ఉంది. ఈ మందిరం లో ని ప్రతిమని క్రమం తప్పకుండా పూజిస్తారు. రాంరై అనే పురాతన గ్రామం అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక ప్రదేశం. ఏడాది పొడవునా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి విచ్చేస్తారు.