హర్యానా రాష్ట్రము లోని పురాతన ఆవాసాలు ఉన్న ప్రదేశం ఈ జింద్ జిల్లా. వీటి విశేషాలు,పేర్లు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి . ఈ ప్రదేశం ఒక్క హిందువుల ఆధ్యాత్మిక విశేషాలు కల ప్రదేశమే కాక ముస్లింలకు కూడా ముఖ్యమైనది . అటువంటి పురాతన స్మరకాలలో ఒకటి హజ్రత్ గైబి సాహిబ్ , ఇది తెహసిల్ నర్వాన ప్రదేశం లో ని జింద్ లో ఉన్నది .
ఎన్నో అధ్బుత శక్తులు కల ప్రఖ్యాత సూఫీ సన్యాసి హజ్రత్ గైబి సాహిబ్ యొక్క సమాధి ఇది. ఈయన భూమిలోకి అదృస్యం అయ్యారని చెప్తారు . ఈ సమాధి చుట్టూ ఒక అందమైన ట్యాంక్ ఉన్నది , ప్రర్ధనకి ముందు ఇక్కడి నీటి తో భక్తులు తమ కరచరణాలు శుద్ది చేసుకుంటారు