సిక్కుల మందిరాలైన గురుద్వారాలను సంబోధించేటప్పుడు సాహిబ్ అనే పదం సాధారణంగా వాడతారు. దంతాన్ ఒక గ్రామము అయినా , ఆధ్యాత్మిక మరియు చారిత్రక విశేషం కలది కాబట్టి ఈ గ్రామం తో కూడా అనుసంధానించబడింది . అలాగే దంతాన్ అనే పేరు 'ధరంస్థాన్ ' అంటే ఆధ్యాత్మిక ప్రదేశం నుండి వచ్చిందని భావిస్తారు .
జింద్ జిల్లా లో ని తెహసిల్ నార్వన నుండి 17 కి మీ దూరం లో ఉన్నది ఈ దంతాన్ గ్రామం . ఇక్కడ ప్రాచీన శివ దేవాలయం మరియు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉన్నయి. శ్రీరాముడు ఇక్కడనే అస్వమెధ యాగం నిర్వహించాడని నమ్ముతారు .
ఢిల్లీ ప్రయాణం లో ఉండగా సిక్కుల తొమ్మిదవ గురువైన గురు తేజ్ బహదూర్ ఇక్కడ ఉన్నారని నమ్ముతారు . ఈ గురువు యొక్క ఆగమన గౌరవార్ధం ఇక్కడి స్థానికులు 500 ఎకరాలు విస్తారం లో ఒక కోట లాంటి గురుద్వారాని బహుమతిగా ఇచ్చారు . మంజీ సాహిబ్ అనే మరొక గురుద్వారా కూడా ఇక్కడ ఉన్నది .