550 ఏళ్ళ క్రితం నిర్మించ బడిన ఈ జయంతి దేవి దేవాలయం , ఉత్తర చండీగర్ లోని హథ్నుఔర్ ప్రదేశం రాజు యొక్క కోడలు అయిన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా రాజు యొక్క కూతురి కోరిక ప్రకారం నిర్మించ బడినది . ఈ యువరాణి విజయానికి దేవత అయిన జయంతి దేవి యొక్క గొప్ప భక్తురాలు .
ఆమె వివాహం తర్వాత ఈ దేవత ను పుజించటానికి దేవాలయం లేకపోతే కుదరదేమో అని బాధపడింది . ఆమె దేవతని సహాయం చేయమని ప్రార్ధించింది . అప్పుడు బోయిలు మోయలేనంత గా పల్లకి బరువెక్కిందని , అమ్మవారి విగ్రహం ఒకటి పల్లకిలో పెట్టగా పల్లకిని పంపగలిగారని నమ్ముతారు . అందువలన హత్నూర్ రాజు ఈ దేవాలయాన్ని జయంతి దేవి అమ్మవారి కోసం శివాలిక్ పర్వత శ్రేణిలో , చండీగర్ కు 15 కి మీ దూరం లో నిర్మించారు .
పర్వత ప్రాంతం లో జయంతి మజరి గ్రామం మరియు జయంతి అర్కెలొజికల్ మ్యుజియం ఉన్నాయి . అంతే కాక జయంతి రావు అనే కాలానుగుణంగా ప్రవహించే కాలువ 100 మెట్లు ఎక్కితే వచ్చే జయంతి మందిరంతో ప్రాచుర్యం పొందింది.