జోర్హాట్ నగరాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికి నిర్మించిన ధృడమైన కట్టడం లడాయి ఘర్. ఈ నగరాన్ని రక్షించడానికి ప్రతాప సింహుడు అనే రాజు దీన్ని నిర్మించాడు. ఇది జోర్హాట్ నగర కేంద్రం నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో వుంది.
ఈ కోట లో వున్న మూడు భాగాలు తలా ఒక దిక్కుకు అభిముఖంగా వున్నాయి. మేరా ఘర్, స్వాలటత్ ఘర్, లడాయి ఘర్ అనేవి ఈ మూడు భాగాలు.
జోర్హాట్ లోని ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాల్లో లడాయి ఘర్ ను ఒకటిగా పరిగణిస్తారు, జోర్హాట్ లో తప్పక చూడాల్సిన జాబితాలో ఇది కూడా వుంది. కోటలోని చాలా భాగాలు శిదిలమైపోయినా, ఇప్పటికీ అది ఘనంగానే వుంది. లడాయి ఘర్ చేరుకోవడానికి యాత్రికులు జోర్హాట్ నగర కేంద్రం లేదా ఘర్ ఆలి నుంచి టాక్సీలలో వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications