మొదటి అస్సామీ దినపత్రిక ప్రచురితమైన కార్యాలయం తెంగల్ భవనం. తెంగల్ భవనం జోర్హాట్ సమీపంలోని టిటాబోర్ లో వున్న జలుకోనిబారి లో వుంది. అస్సామీ భాష లో ప్రచురితమైన తొలి దినపత్రిక మాత్రమె కాక, భారత దేశంలోని ఒక కుగ్రామం నుంచి ప్రచురితమైన తొలి దిన పత్రిక కూడా తెంగల్ భవన్ మాత్రమె.
1880 లో రాయ్ బహదూర్ శివ ప్రసాద్ బారువా తెంగల్ భవన్ నిర్మించాడు. 1929 లో బారువా ఒక అస్సామీ వార వార్తాపత్రిక ప్రచురించడం మొదలు పెట్టాడు. తరువాత దాన్ని దినపత్రిక గా మార్చాడు.
ఆ పత్రిక కు దైనిక బాతరి అనే పేరు పెట్టారు. బారువా దీని యజమాని కాగా బాగ్మిబార్ నిలమని ఫుకాన్ దీనికి సంపాదకుడు.
తెంగల్ భవన్ చేరుకోవాలంటే టాక్సీ మాట్లాడుకుని టిటాబోర్ కు చేరుకోవచ్చు. టిటాబోర్ కు ప్రజా రవాణా వ్యవస్థలో బస్సులు కూడా అందుబాటులో వున్నాయి. టిటాబోర్ జోర్హాట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వుంది, రోడ్డు మార్గం లో సుమారు 30 నిమిషాలు పడుతు౦ది.



Click it and Unblock the Notifications