తోకలాయి తేయాకు పరిశోధన కేంద్రం ప్రపంచం లోని ప్రాచీన తేయాకు పరిశోధన కేంద్రాలలో ఒకటి. తేయాకు నాణ్యతను, ఉత్పాదకతను పెంచడానికి శాస్త్రీయ పరిశోధన చేయడానికి దీన్ని 1911 లో స్థాపించారు. గత వందేళ్ళలో ఇది తన్ను తాను ప్రధాన పరిశోధన కేంద్రాల్లో ఒకటిగా నిలుపుకుంది.
గడచిన కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న పరిశోధనల వల్ల 1951 లో ఈశాన్య భారతంలో 234 మిలియన్ కిలోలు వున్న తేయాకు ఉత్పత్తి 1998 నాటికి 669 మిలియన్ కిలోలకు పెరిగింది. ప్రస్తుతం తోకలాయి పరిశోధన కేంద్రంలో ఎనిమిది విభాగాలు వున్నాయి అవి జీవశాస్త్రం, ఆగ్రానమీ, మట్టి, మొక్కల రక్షణ, ఇంజనీరింగ్, బయో కెమిస్ట్రీ, ఉత్పత్తి సాంకేతికత, గణాంకాలు, వ్యవసాయ ఆర్ధిక శాస్త్రం, టీ రుచి చూడడం లాంటి వాటి మీద దృష్టి పెట్టాయి.
తోకలాయి తేయాకు పరిశోధన కేంద్రం క్లబ్ రోడ్ లో వుండడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. పర్యాటకులు ఇక్కడ తేయాకు పరిశోధన ఎలా చేస్తారో చూడవచ్చు.



Click it and Unblock the Notifications