కాంగ్రా జిల్లలో ని కథ గర్హ్ లో ఉన్న ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి గాంచినది. షిమ్లా నుంచి 181 కిలోమీటర్లు, ధర్మశాల నుండి 54.7 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ఈ దేవాలయం. ఎంతో మంది భక్తులు పరమ శివుడ్ని పుజించుకోవడానికి ఇక్కడికి వస్తు ఉంటారు, ఈ గుడిలో ఉన్నటువంటి పొడవాటి శివలింగం రెండు భాగాలుగా కనబడుతుంది. పెద్ద భాగాన్ని శివుడిగా ను, చిన్న భాగాన్ని పార్వతీ దేవిగాను కొలుస్తారు. ఈ రెండు భాగాల మధ్య దూరం కాలానుగుణంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.
పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులు తమ ఆధిపత్యం కోసం పోరాడినప్పుడు శివుడు ఆ వివాదాన్ని ఆపడానికి ఒక అగ్ని స్థూపం గా మారాడు అని అదే శివలింగం అని ప్రజలు నమ్ముతారు.