జైన్ గ్లాస్ టెంపుల్ ను జైన మతస్తులు, వారి మతంలోని 24 తీర్థంకరుల గౌరవార్ధం నిర్మించారు. టెంపుల్ లో భగవాన్ మహావీర, తీర్థంకరుల విగ్రహాలు వుంటాయి. పెద్ద మార్బుల్ ప్లాట్ ఫారం పై ఎత్తైన రూఫ్ కింద వుంటాయి. ఈ టెంపుల్ కమల టవర్ సమీపంలో మహేశ్వరీ మహల్ వద్ద కలదు. టెంపుల్ నిర్మాణం పూర్తిగా గ్లాస్ మరియు ఎనామేల్ తో చేసారు. స్థానికులు, పర్యాటకులు ఎల్లపుడూ అధిక సంఖ్యలో వస్తూనే వుంటారు. నిర్మాణంలో మార్బుల్ మరియు గ్లాస్ ను అధికంగా ఉపయోగించారు.దీనిపై అనేక జైన మత గ్రందాల రచనలు చేసారు. టెంపుల్ లో మిర్రర్ పని బాగా కనపడుతుంది.