నానా రావు పార్క్ ను కంపనీ బాగ్ అని కూడా అంటారు. 1857 స్వాతంత్ర యుద్ధంలో నానా రావు సాహిబ్ నాయకత్వంలో ఇక్కడ కల ఒక బావిలో సుమారు 200 మంది బ్రిటిష్ మహిళలను, పిల్లలను చంపి పడవేశారు. కనుక దీనిని మెమోరియల్ వెల్ అని కూడా అంటారు. ఈ మారణకాండ సాగిన బిల్డింగ్ ను బిబి ఘర్ అంటారు.
బ్రిటిష్ అధికారులు ఈ మారణ కాండకు బదులుగా ఇక్కడే కొంత మందిని శిక్షించారు. ప్రజలపై సుంకాలు విధించి ఆ సొమ్ముతో ఒక మెమోరియల్ నిర్మించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఈ స్మారకాన్ని పడగొట్టింది. ప్రస్తుతం పార్క్ లో 1857 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రసిద్ధ నేతలు తాంతియా తోపే, అయిజాన్ బై, రాణి అఫ్ ఝాన్సి వంటి వారి విగ్రహాలు కలవు.