బంగ్లా లానే చెట్టినాడు మాన్షన్ కూడా ఒక హెరిటేజ్ భవనమే. కాని బంగ్లా లాగా హోటల్ కాదు, ఇది హెరిటేజ్ భవనం. పర్యాటకులు కరైకుడికి వొచ్చినప్పుడు ఈ మాన్షన్ లో సౌకర్యంగా, సంతోషంగా గడపవొచ్చు. ఇది త్రిచి, తంజావూర్ మరియు మదురై పట్టణాలకు సమానమైన దూరంలో ఉన్నది.
దీనిని చెట్టియార్లు 1902వ సంవత్సరంలో కట్టించారు. ఇది వారు కట్టించిన గొప్ప భవనాలలో ఇది ఒకటి. ఇండియాకు స్వతంత్రం వొచ్చిన తరువాత, అంటే 1947 లో దీనిని హెరిటేజ్ హొమ్ గా మార్చారు మరియు అప్పటినుండి ఇది ఇంటర్నేషనల్ పర్యాటకులకు అథితి గృహంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇక్కడ సౌకర్యవంతమైన వసతితో పాటు మాన్షన్ వంటగదిలో తయారుచేయబడిన ఆహారం దొరుకుతుంది. అథితులు లైబ్రరి మరియు స్విమ్మింగ్ పూల్ వంటి అందనపు సౌకర్యాలను కూడా పొందవొచ్చు. ఈ మాన్షన్ సాహస అథితుల కోసం మార్గదర్శకమైన పర్యటనలు మరియు ఎద్దుల బండి స్వారిలు వంటివి నిర్వహిస్తున్నది.



Click it and Unblock the Notifications