భవానీ మాత దేవాలయం దాదా దర్బార్ సమీపంలో ఖాండ్వా పట్టణమునకు నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో దేవత తులజా భవానీ అనే హిందూ మత దేవత అయిన పార్వతి యొక్క అవతారంగా ప్రతిష్టించారు.
తులజా భవానీ మాత దేవాలయం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు దేవి ఆశీర్వాదము కోసం వస్తూ ఉంటారు. ఈ ఆలయం భారతదేశంలో ఉన్న దేవి మాత ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ఉన్నది. ఈ ఆలయంను సందర్శిస్తే ఆ వ్యక్తి యొక్క దురదృష్టం నుండి విముక్తి మరియు అన్ని పాపాలను క్షమిస్తుందని నమ్మకం.
ఈ పురాతన ఆలయంతో ముడిపడి అనేక కధనాలు ఉన్నాయి. ఇది లార్డ్ రామ తన దేశ బహిష్కరణ సమయంలో ఈ ఆలయంలో పూజలు చేసారని చెబుతుంటారు. నవరాత్రి సందర్భంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ ఉత్సవంలో వేలమంది భక్తులు పాల్గొని భవాని మాతను సందర్శించుకుని తరిస్తారు.