కొహిమ వార్ సీమేట్రీ ప్రవేశంలో గల రాతి ఫలకంపై ' మీరు ఇంటికి వెళ్ళినపుడు, ' మీ యొక్క రేపు కొరకు మేము ఈ రోజున మా ప్రాణాలు త్యాగం చేశాము అని తెలుపండి ' అనే లైన్ లు కనపడతాయి. ఈ శ్మశానం లో సుమారు 1421 మంది యుద్ధం లో మరణించిన సైనికుల సమాధి ఫలకాలు కనపడతాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ప్రాంతం ఆసియా లో అతి భయంకరంగా యుద్ధం నిర్వహించబడింది. ఇక్కడ కల ప్రతి సమాధికి ఒక తగిన వ్రాతతో ఒక కంచు లేదా బ్రాంజ్ ప్లేట్ వుంటుంది. దీనిని కామన్ వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్ నిర్వహిస్తోంది. వేలాది పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి ఇంగ్లాండ్ మరియు కెనడా ల నుండి ఇక్కడకు వచ్చి మరణించిన యుద్ధ వీరులకు శ్రద్దాంజలులు అర్పిస్తారు.