విజింజమ్ రాతి గుహలు, కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు విజింజమ్ గ్రామలో ఉన్నాయి, ఇక్కడ రాళ్ళ నుండి చెక్కిన శిల్పాలతో తయారుచేసారు. ఈ శిల్పాలలో పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవి ప్రదానమైనవి. అయితే, పర్యాటకులు ఇటీవల కాలం వరకు ఈ రాతి శిల్పాల ప్రాముఖ్యతను గుర్తించలేదు. ఈ గుహ ఆలయం నిజానికి ఒకే రాతితో చెక్కబడిన పుణ్యక్షేత్రం, ఇక్కడ దక్షిణామూర్తి అవతారాలలో ఒకరైన వినంధ్రా దక్షిణామూర్తి శిల్పం ఉంది. ఈ ఆలయ బయటి గోడలపై శివుడు, పార్వతిల విగ్రహాలు అసంపూర్తిగా చెక్కబడి ఉన్నాయి. కోవలం బీచ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్న విజింజమ్ రాతి గుహ మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన చోటు. ఈ ఆలయం ప్రజల సందర్శనార్ధం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గ౦టల వరకు తెరిచే ఉంటుంది. సోమవారం ఈ ఆలయం మూయబడి ఉంటుంది.