సన్నిహిత సరోవర్ ఏడూ పవిత్ర సరస్వతిల సంగమంగా చెప్పబడుతుంది. ‘సాన్నిహిత్’ అనే పదానికి సేకరించడం అని అర్ధం. దీని అర్ధానికి వాస్తవికత ఉంది, సన్నిహిత సరోవర్ అన్ని పవిత్ర నదులు, తీర్దాల నుండి, ప్రత్యేకంగా అమావాస్య, సూర్యగ్రహణం సమయంలో ఏడూ పవిత్ర సరస్వతి ల నుండి నీటిని స్వీకరిస్తుందని నమ్ముతారు. పుర్నమి రోజు సన్నిహిత సరోవర్ లో స్నానం చేస్తే, గ్రహణం రోజు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని గ్రంధాలు చెప్తున్నాయి.
ప్రార్ధనలు, చందాలు, ఆచారాలతో పాటు ఈ టాంక్ లో స్నానం చేస్తే, చనిపోయిన బంధువుల ఆత్మా శాంతిస్తుందని కూడా నమ్ముతారు. అందువలన, హిందువులు పెద్ద సమూహంగా వారి మరణించిన పూర్వీకులు, ఇతర ప్రియమైన వారి తరపున పిండప్రదానం చేయడానికి ఈ సరోవర్ సందర్శిస్టారు. ఈ సరోవర్ లో విష్ణుమూర్తి నివసిస్తాడని నమ్మేవారు ఆయన దీవెనలు పొందుతారు.
హనుమాన్, విష్ణుమూర్తి, ధృవ భగత్, దుర్గామాత, లక్ష్మి నారాయణ తోసహా పలు దేవీదేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు ఈ సరోవరానికి పొడవు, వెడల్పు సమీపంలో ఉన్నాయి.
ఈ సరోవరాన్ని హిందూ భక్తులేకాక, సిక్కులు కూడా సందర్శిస్తారు. కురుక్షేత్ర లో గురువుల సందర్సన గౌరవార్ధం నిర్మించిన అనేక గురుద్వారాలు ఉన్నాయి.