మలయత్తూర్ ఎర్నాకులం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు మూడు మళయాళం మాటలనుండి వచ్చింది. మల అంటే పర్వతం, అర్ అంటే నది మరియు ఊర్ అంటే స్ధలం అని చెపుతారు. చిన్నది మరియు సుందరమైనది అయిన ఈ పట్టణం పడమటి కనుమలకు మరియు పెరియార్ నదికి మధ్యన పర్వతాలు, భూమి మరియు నీరు కలిసే ప్రదేశంలో కలదు.
మలయత్తూర్ ఒక పురాతన కేధలిక్ చర్చికి ప్రసిద్ధి చెందింది. ఈ చర్చి క్రైస్తవ బోధకుడు సెయింట్ ధామస్ కు అంకితమివ్వబడినది. ఈ ప్రదేశం క్రిస్టియన్లకు యాత్రా స్ధలమే కాదు. సుందర అందాలు కల పట్టణం. ఇక్కడ సెయింట్ ధామస్ చర్చి మాత్రమే కాక, మరో రెండు చర్చిలు కలవు. వీటిని చర్చి ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ మరియు సెయింట్ సెబాస్టియన్ చర్చిలంటారు. ఇక్కడే దుర్గా దేవి దేవాలయం కూడా కలదు. మలయత్తూర్ వచ్చే యాత్రికులు మూలం కుజ్జి మరియు మహాగని తోట్టం ప్రదేశాలు కూడా చూడవచ్చు.
దైవ భూమిలోని రుచులు మరియు కాలాలు
భక్తులు మరియు పర్యాటకులు సంవత్సరం పొడవునా ఈ చర్చికి వస్తూనే ఉంటారు. చర్చి ఎల్లపుడూ జన సమూహాలతో వుంటుంది. అయితే, వర్షాకాలంలో వర్షాలు అధికం కనుక సైట్ సీయింగ్ అసాధ్యమవుతుంది. మలయత్తూర్ పర్యటనకు శీతాకాలం అనుకూలమైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మలయత్తూర్ కొచ్చి నుండి 47 కి.మీ. ల దూరంలో ఉండి, ఇరుగు పొరుగు జిల్లాలకు రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. ఇక్కడ తయారయ్యే ఆహారాలు మళయాళీల రుచులుగా ఉంటాయి. చిన్న హోటళ్ళు, కాఫీ హౌస్ లు ఈ ప్రదేశం ప్రత్యేకత. పండుగ సందర్భాలలో టవున్ బిజీ గా ఉండే సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం కొత్త తాత్కాలిక హోటళ్ళు కూడా తెరుస్తారు.



Click it and Unblock the Notifications