మరావంతే లో కుందాపూర్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ పట్టణాన్ని సూర్య పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ కుందేశ్వర దేవాలయం ఉంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు పాలకులు, జర్మన్ మత ప్రచారకులు ఈ పట్టణం స్ధాపించారని చెపుతారు. తర్వాతి కాలంలో టిప్పు సుల్తాన్ దీనిని వశం చేసుకోగా ఆ తర్వాత దీనిని బ్రిటీష్ వారు పాలించారు. ఈ పట్టణం బైందూరు రాజులకు ప్రధాన ఓడరేవుగా ఉండేది. పట్టణం మూడు వైపులా నీరు ఉంటుంది. ఉత్తరం వైపు పంచగంగావళి నది, తూర్పు కళాఘర్ నది, పడమరలో అరేబియా సముద్రం ఉంటాయి. అయితే టవున్ లోకి నీటి రవాణా లేదు. కొన్ని స్ధానిక బోట్లు సరఫరా చేస్తాయి. పర్యాటకులు బోట్ లో సమీప గ్రామాలకు ప్రయాణించవచ్చు.



Click it and Unblock the Notifications